PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

30 లక్షల వ్యయంతో పార్కు నిర్మాణం సుందరీ కరణకు శంకుస్థాపన

1 min read

శంకుస్థాపన చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని

రాష్ట్ర అభివృద్ధి జగనన్న ధ్యేయం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు 25వ డివిజన్ శనివారపుపేట లో గురువారం నూతన పార్క్ నిర్మాణము మరియు సుందరీకరణ  అభివృద్ధి నిమిత్తం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 30లక్షల నిధులతో సుందరీకరణ చేపట్టే కార్యక్రమ శంకుస్థాపన కి ముఖ్యఅతిథిగా మాజీ డిప్యూటీ సీఎం మరియు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని  అమృత హస్తాలతో శంకుస్థాపన చెయ్యడం జరిగింది. రాష్ట్ర అభివృద్దె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు  స్థానిక వైసిపి శాసనసభ్యులు, నాయకులు నడుం బిగించారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ , కోప్షన్ సభ్యులు SMR పెదబాబు  మరియు 25 వ డివిజన్ కార్పొరేటర్ గుడిపుడి శ్రీనివాస్ ,  డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్ , నుకపెయ్యి సుధీర్ బాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నెర్సు చిరంజీవి, మరియు క్లస్టర్ 1 అధ్యక్షులు సుంకర చంద్రశేఖర్, అన్ని విభాగాల చైర్మన్లు మరియు ఈడా VC , కార్పొరేటర్లు, వైస్సార్సీపీ కోప్షన్ సభ్యులు మరియు JAC అధ్యక్షులు, 25వ డివిజన్ వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author