PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోటి పైచిలుకు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మండల పరిధిలోని గడిగరేవుల గ్రామంలో శనివారం నాడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోటి పైచిలుకు నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం ఆర్ బి కే .వెల్ నెస్ సెంటర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని గత ఐదు సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు నేరుగా పేద ప్రజలకు డీ బీ టీ ద్వారా  ప్రజల అకౌంట్లో డబ్బులు జమ చేయడం దేశ చరిత్రలో కొత్త సంప్రదాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా 50 కుటుంబాలకు పింఛన్ ఆసరా ఆరోగ్య సంరక్షణ అమ్మ ఒడి లాంటి పథకాలు నేరుగా అందజేశామునీ దాదాపు 95% మేనిఫెస్టోల ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే అన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈసారి జగనన్న కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న జొన్న మార్కెఫెడ్ ద్వారా సంచులు అందుబాటులో లేవని. మండలంలో జొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి మండలంలో పూర్తిస్థాయిలో జొన్నలు కొనుగోలు చేయాలని ప్రైవేట్ సంచులు అనుమతించాలని రైతులను ఇబ్బందులు గురి చేస్తే ఒప్పుకోనని హెచ్చరించారు వెంటనే గడివేముల మండల వ్యాప్తంగా రైతుల జొన్నలు రెండు మూడు రోజుల్లో  తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. ఎంపీటీసీ జక్కుల సావిత్రి. సర్పంచ్ బిఎస్ రామ్మోహన్ రెడ్డి. కో ఆప్షన్ నెంబర్ హుస్సేన్ భాష . ఉప సర్పంచ్ గోదాప్రసాద్. ఎల్లారెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. శిరప శ్రీనివాసరెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి. రఘు మాధవరెడ్డి. వెంకటకృష్ణారెడ్డి. మాజీ చైర్మన్ రాచమల్లు గోపాలయ్యా. వసంత వెంకటరమణ. బాల చెన్నీ . మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

About Author