PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సొంత నిధుల‌తో ఫౌంటెన్ ఏర్పాటు : టీజీ వెంక‌టేశ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంతో చరిత్ర కలిగిన కొండారెడ్డి బురుజు ఆధునిక హంగులకు ఎన్ని నిధులైన సమకూరుస్తామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కొండారెడ్డి బురుజు చుట్టూ తిరిగేందుకు వీలుగా రోడ్ నిర్మాణం కోసం చుట్టూ ఉన్న షాపుల యజమానులతో మాట్లాడి నష్టపరిహారం ఇస్తామన్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయన్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని సూచించారు. కర్నూలు మేయర్ రామయ్య కోరిక మేరకు రాజ్ విహార్ సెంటర్‌లో సొంత నిధులతో ఫౌంటెన్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

                                                

About Author