PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హత్యాయత్నం ఘటనలో నలుగురి అరెస్టు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది : మహానంది మండలం గాజులపల్లె ఆర్ఎస్ మందు కాకర్ల రంగ సాయి అనే వ్యక్తిపై ఈ నెల 4న జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ రవీంద్ర తెలిపారు. గాజులపల్లి గ్రామానికి చెందిన నాగ సాయి హరి, తుమ్మల రంగన్న , కోలా నరసింహులు తో పాటు మరో బాలనేరస్థుడిన అరెస్టు చేసినట్లు సిఐ పేర్కొన్నారు. గ్రామాల్లో అలజడులు సృష్టించి భయబ్రాంతులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహానంది ఎస్సై నాగార్జున్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

About Author