PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య

1 min read


పల్లెవెలుగు వెబ్: యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పాశవికంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన ప్రయాగ రాజ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘోర ఘటనకు భూ తగాదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో 16 ఏళ్ల అమ్మాయి, 10 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అమ్మాయిని హత్య చేసే ముందు అత్యాచారం చేసి చంపినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన దళితులు. ఇటీవల భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన అగ్రకులం వారు.. ఈ దళిత కుటుంబంతో గొడవకు దిగ్గారు. దీంతో అది మనసులో పెట్టుకుని దారుణానికి ఒడిగట్టారని మృతుల బంధువులు ఆరోపించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే 11 మంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పరామర్శించనున్నారు.

About Author