NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒకే ఇంట్లో నలుగురి మృతి: క‌రోన ఎఫెక్ట్

1 min read

పల్లెవెలుగు వెబ్: క‌రోన క‌రాళ నృత్యం చేస్తోంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా క‌బ‌ళించి వేస్తోంది. రూపం మార్చుకుని దాడి చేస్తోంది. విజ‌య‌వాడ‌లో ఒకే కుటుంబంలో న‌లుగురిని బ‌లితీసుకుంది. విజ‌య‌వాడ పాత‌బ‌స్తీకి చెందిన లాయ‌ర్ దినేష్ క‌రోనతో మృతి చెందారు. ఈరోజు ఉద‌యం దినేష్ తండ్రి , మూడు రోజుల క్రితం దినేష్ త‌ల్లి, బాబాయ్ మృతి చెందారు. వీరంద‌రికి క‌రోన పాజిటివ్ వ‌చ్చింది. దీంతో పాత బ‌స్తీ ప్రాంతంలో విషాద‌చాయలు అలుముకున్నాయి. క‌రోన ఎవ‌రిని.. ఎప్పుడు బ‌లి తీసుకుంటుందోనన్న భ‌యాందోళ‌న‌లో ప్రజ‌లు ఉన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్రజ‌ల్లో భ‌యం పెరుగుతోంది.

About Author