PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే రోజు నాలుగు ల‌క్ష‌ల క‌రోన కేసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనా తరువాత తాజాగా సౌత్ కొరియాలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. బుధవారంనాడు రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ సమాచారం ప్రకారం, కొత్తగా 4 లక్షల 741 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది జనవరిలో తొలి కోవిడ్ కేసు వెలుగు చూసిన తర్వాత దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో సౌత్ కొరియాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 76 లక్షలలకు చేరుకున్నట్టు కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడీసీఏ) తెలిపింది. సౌత్ కొరియాలో మంగళవారంనాడు కేవలం 24 గంటల్లో 293 మరణాలు సంభవించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

                               

About Author