PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పైక‌ప్పు కూలి న‌లుగురి మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పంజాబ్ పటియాలాలో విషాదకర ఘటన జరిగింది. ధనక్ బస్తీ జాఖాల్ రోడ్‌లో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను రాజు, సునీత, అమన్, ఉషాగా గుర్తించారు. గాయపడిన 15 ఏళ్ల వికాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు ఇంటి పైకప్పు కూలడంతో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబం పది నెలలుగా ఈ ఇంట్లో కిరాయికి ఉంటోంది. అంతా నిద్రిస్తున్న సమయంలో ఘటన జరగడంతో తప్పించుకోవడానికి మార్గం లేకుండాపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వికాస్‌ను స్థానికులు అధికారుల సాయంతో పట్రాన్ ఆసుపత్రికి తరలించారు.

                                       

About Author