PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడుగుపడి న‌లుగురు మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు వద్ద అర్ధరాత్రి పిడుగుపడి నలుగురు వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, కత్తిపూడి ప్రాంతాల నుంచి వచ్చిన వి.ధర్మరాజు (25), కొండబాబు(35), వేణు(19), ఆర్‌.రాజు(28) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కె.గణేశ్‌, బుల్లయ్య, అర్జున్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి… అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. భోగోలు అటవీ ప్రాంతంలో జామాయిల్‌ చెట్లు నరకడానికి సంబంధిత కాంట్రాక్టర్‌ తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి, ఏలేశ్వరం, అన్నవరం ప్రాంతాల నుంచి సుమారు 40 మంది కూలీలను తీసుకువచ్చారు. నాలుగైదు రోజులుగా వారు పనులు చేస్తూ అక్కడే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వాటిలో ఒక గుడారంపై పిడుగు పడటంతో అందులో ఉన్న తొమ్మిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడగా ముగ్గురికి గాయాలయ్యాయి.

                                                   

About Author