PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జవాన్ల మ‌ధ్య గొడ‌వ‌.. న‌లుగురు జవాన్లు మృతి !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :చ‌త్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా ప‌రిధిలో గ‌ల లింగంప‌ల్లి పారామిల‌ట‌రీ బేస్ క్యాంపులో దారుణం జ‌రిగింది. జ‌వాన్ల మ‌ధ్య త‌లెత్తిన గొడ‌వ న‌లుగురి ప్రాణాలు తీసింది. సోమ‌వారం తెల్లవారుఝామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సెల‌వుల విష‌యంలో జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్షణ జ‌రిగింది. కానిస్టేబుల్ రితేష్ రంజ‌న్ త‌న స‌ర్వీసు తుపాకీ ఏకే-47తో తోటి జ‌వాన్ల పై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు గాయ‌ప‌డ్డారు. వీరిని భద్రాచ‌లం ఏరియా ఆస్పత్రికి త‌రలించ‌గా.. న‌లుగురు మృతి చెందారు. మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ప్రత్యేక హెలికాప్టర్ లో రాయ్ పూర్ కి త‌ర‌లించారు.

About Author