PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్ బీమా పేరుతో మోసాలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ బీమా పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు బీమా పరిహారం వస్తుందంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠా గత ఏడాదిగా ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న విషయం వెల్లడైంది. ఈ ముఠాలో నేపాల్ కు చెందిన వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, ఇప్పటిదాకా నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3.29 లక్షల నగదుతో పాటు 73 ఏటీఎం కార్డులు, 18 మొబైల్ ఫోన్లు, 290 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

About Author