PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోటి మందికి ఉచిత విద్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆన్ లైన్ ఎడ్యుకేష‌న్ సంస్థ బైజూస్‌ ఉచిత విద్యా కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. 2025 నాటికి గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని కోటి మంది విద్యార్థులకు ఉచితవిద్య అందించనున్నట్టు తెలిపింది. 2025 నాటికి 50 లక్షల మందికి ఉచిత విద్య అందించాలన్న లక్ష్యాన్ని రెట్టింపు చేసింది. ఇందులో ఇప్పటికే 34 లక్షల మందిని ఉచిత విద్యా కార్యక్రమం ద్వారా చేరుకున్నట్టు బైజూస్‌ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకులనాథ్‌ తెలిపారు. ఉచిత విద్య అందించేందుకు బైజూస్‌ 128 స్వచ్చంద సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

                                   

About Author