NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్ణాటక పాదయాత్రికుల ఉచిత అన్నదాన కార్యక్రమం

1 min read

– ప్రారంభించిన చైర్మన్ సుధాకర్ రెడ్డి
పల్లెవెలుగువెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో సీడ్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ చక్రపాణి ఆధ్వర్యంలో ఆత్మకూరు రోడ్డులోని జమ్మిచెట్టు దగ్గర శ్రీ వినాయక స్వామి దేవాలయం సమీపంలో ఉగాది పండుగ సందర్భంగాదక్షిణ కాశీ అష్టదశ శక్తి పీఠాల్లో ప్రసిద్ద శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలానికి కాళి నడకన వెళుతున్న కర్ణాటక భక్తులకు దాతల సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కన్నడ పాదయాత్రికులకు అన్నదానం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.అన్నదాన కార్యక్రమం చేపట్టినా దాతలను ఆయన అభినందించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు చైర్మన్ సుధాకర్ రెడ్డి ని సత్కరించారు. కార్యక్రమంలో కో- ఆప్షన్ సభ్యులు కేశవరెడ్డి శ్రీనివాస రెడ్డి, మండల వ్యవసాయ అధికారి బి.శ్రావణి, వైసిపి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, కురువ శ్రీను, వీ.ఆర్ శ్రీను తదీతరులు పాల్గొన్నారు.

About Author