PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : ప్రతి సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా కలెక్టరేట్, ఎస్ పి కార్యాలయాలకు వచ్చే గ్రీవెన్ సెల్ అర్జీదారులు, ప్రజలకు ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం నేటితో 18వ వారానికి చేరుకుంది.వైఎస్ఆర్ సిపి జిల్లా మైనారిటీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ సౌజణ్యంతో ఈ సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్, ఎస్ పి కార్యాలయా లకు గ్రీవెన్ సెల్ నిమిత్తం వచ్చిన అర్జీ దారులు, ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన భోజనంతో పాటు అరటిపండును సైతం అందచేస్తున్నారు.వారం వారం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో, దాతల సౌజన్యంతో గ్రీవెన్ సెల్ రోజున జిల్లావ్యాప్తంగా వచ్చే ప్రజలకు రుచికరమైన,నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తుండడం హర్షణీయం, ఆదర్శనీయమంటూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అభిననందిస్తున్నారు.

About Author