PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివరాత్రి సందర్భంగా దుర్గ భోగేశ్వరం లో ఉచిత వైద్య శిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్పర్సన్ పర్లా దస్తగిరి  ఆదేశాల మేరకు గడివేముల మండల రెడ్ క్రాస్ చైర్ పర్సన్ వీవీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స చేయుచున్న ఆర్ఎంపి మరియు పిఎంపి వైద్య సోదరులతో సమావేశం ఏర్పాటు చేసి మహాశివరాత్రి సందర్భంగా 8,9,10 వ తేదీలలో శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఉచిత వైద్య శిబిరంలో గడివేముల మండలంలో పనిచేయుచున్న ఆర్ఎంపీ మరియు పిఎంపి సోదరుఅందరూ పాల్గొని భక్తులకు వారి సేవలను అందించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల ఆర్ఎంపీ మరియు పీఎంపీ వైద్యుల గౌరవ అధ్యక్షులు ఇందిరా వరదాచార్యులు,సెక్రటరీ వెంకటేశ్వర్లు,శ్రీనివాసులు, అనంత్ కుమార్,రమేష్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ బాబు మరియు ఆర్ఎంపీ,పీఎంపీ సోదరులు పాల్గొన్నారు. 

About Author