ఉచిత వైద్య శిబిరం… మహిళలకు చీరల పంపిణీ
1 min read
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
మాతృదినోత్సవం సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, న్యూస్ నేడు : మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నగరంలోని బీకే గూడ ప్రాంతంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 80 మందికి ఎత్తు, బరువు, బీపీ, రక్తపోటు, మధుమేహం, ఎస్పీఓ2, హెమోగ్లోబిన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందించారు. దాంతోపాటు శ్రీనివాస సమాజసేవ ఛారిటబుల్ ట్రస్టు, ఆస్టర్ డీఎం ఫౌండేషన్ సంయుక్తంగా 300 మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఫైనాన్స్ విభాగాధిపతి జె. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస సమాజసేవ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
