PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీపక్ నెక్స్ జన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : చాటపర్రు జాలిపూడి గ్రామ వాస్తవ్యులు వ్యాపారవేత్త అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జాలిపూడి గ్రామంలో సుబ్రహ్మణ్యం నివాసం వద్ద గొప్ప ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని  ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు వైద్య శిబిరానికి చేరుకొని  వారి కంటి పరీక్షలను మరియు కంటికి సంబంధించిన వ్యాధుల నిర్ధారణను ప్రముఖ డాక్టర్లచే పరీక్షలు తదుపరి ఆపరేషన్లకు సంసిద్ధం కావటానికి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీపక్ నెక్సజెన్ ఫీడ్స్ మరియు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం స్వగ్రామంలో గతంలో అనేక  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ ప్రజల పరువులు మన్ననలు అందుకుంటున్నారు. అడుసుమిల్లి చైతన్య వాసు (మున్న) విచ్చేయుచున్నారు. వారు చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని కోరారు.

About Author