PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్షయ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా రేషన్ పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : స్థానిక వైద్య ఆరోగ్య కేంద్రం నందు శుక్రవారం నాడు క్షయ వ్యాధి గ్రస్తుల కు న్యూట్రిషన్ రేషన్ పంపిణీ చేశారు.డివిజనల్ టీ బీ ఆఫీసర్ డాక్టర్ సునీత గడివేముల పీహెచ్సీ ని సందర్శించి క్షయ వ్యాధిగ్రస్తులకు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి సహకారం తో ఉచితంగా న్యూట్రిషన్ రేషన్ పంపిణీ చేశారు.అనంతరం డాక్టర్ సునీత క్షయ వ్యాధి గ్రస్తులు సరైన పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవాలని, సరైన మందులు సరైన పద్ధతిలో తీసుకుంటే టీబి ని అధిగమించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యురాలు డాక్టర్ తేజస్విని ఎంపీహెచ్ఈఓ మహేశ్వర రెడ్డి, పిహెచ్ఎన్ సర్వేశ్వరమ్మ, వేణుగోపాల్ రెడ్డి, టీబీ సూపర్వైజర్ శివుడు పాల్గొన్నారు.

About Author