PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత రేష‌న్ పొడిగింపు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : పేద ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నిర్ణ‌యంతో రేష‌న్ కార్డుదారుల‌కు ఎంతో ఊర‌ట ల‌భించింది. కరోనా మహమ్మారి కారణంగా పేద‌ ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందిస్తున్న ఉచిత రేషన్ కార్యక్రమాన్ని మార్చి 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉచిత రేషన్ కార్యక్రమాన్ని 2022 మార్చి వరకు అందించడానికి ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనను పొడిగించాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ తెలిపారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మార్చి 2020లో ప్రకటించారు.

About Author