PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుమలకు ఉచిత దర్శనం

1 min read

పల్లెవెలుగువెబ్​,చాగలమర్రి: సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వరంలో మండలంలోని శెట్టివీడు గ్రామంలో రెండు బస్సుల్లో భక్తులకు ఉచిత రవాణా , ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు . పట్టణంలోని ఏకశిల పదునెట్టాంబడి అయ్యప్ప ఆలయం వద్ద సమరతసేవా ఫౌండేషన్ రాయలసీమ ధర్మప్రచారక్ ఈశ్వర్రెడ్డి , నంద్యాల జిల్లా కన్వీనర్లు సల్లానాగరాజు , జయదేవ్ రెడ్డి లు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఆదివారం బస్సుల్లో నిరుపేదలైన దళిత,గిరిజన భక్తులకు ఉచిత దర్శనాలకు అవకాశం కల్పించామన్నారు . ఒక్కో బస్సులో 49 మంది చొప్పున 343 మందికి ఉచిత దర్శనాలకు తిరుమలకు పంపడం జరిగిందని వివరించారు . దసరా ఉత్సవాల ముగింపు వరకు ప్రతి రోజూ బస్సుల్లో ఉచిత దర్శనాలను ఏర్పాటు చేస్తున్నామని వారు . వివరించారు . కార్యక్రమంలో సమరసత సేవాఫౌండేషన్ సభ్యులు రఘరామ్ , సుబ్బయ్య , శంకరసుబ్బారావు , పుల్లయ్య , సల్లాధనుంజయుడు , గుత్తి నరసింహప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

About Author