PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

27 నుంచి  ఫిబ్రవరి 9వ తేది వరకు నవరత్నాలు

1 min read

– పేదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్ లు చేయించుకోవలసిందిగా లబ్దిదారులకు విజ్ఞప్తి

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నవరత్నాలు-పేదలందరికీ క్రింద మంజూరైన ఇళ్ల పట్టాలను జనవరి 27వ తేది నుంచి ఫిబ్రవరి 9వ తేది వరకు రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ లు చేయించుకోవలసిందిగా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య లబ్దిదారులకు  గురువారం  ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.నవరత్నాలు – పేదలందరికీ క్రింద జిల్లాలో 1,00,242 ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులకు జనవరి 27వ తేది నుండి ఫిబ్రవరి 9వ తేది వరకు వారి వారి సచివాలయాల పరిధిలోనే పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓలు రిజిస్ట్రేషన్  చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన లబ్దిదారులకు  విఆర్ఓ లు ముందుగా తెలియ చేస్తారని, ఆ మేరకు ఇంటి పట్టాల లబ్దిదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని  జాయింట్ కలెక్టర్ కోరారు.

About Author