PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైస్సార్సీపీకి, కర్నూలు నగర పారా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల సంపూర్ణ మద్దతు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కర్నూల్ నగరంలోని పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు సుమారు 200 మంది ఆదివారం కర్నూలు వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ ని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వారికి సంపూర్ణ మద్దతు తెలిపి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు.ఈ సందర్బంగా ఇంతియాజ్ ల్యాబ్ టెక్నిషియన్ లను ఉద్దేశించి మాట్లాడుతూ, నగరం లోని ల్యాబ్ టెక్నిషియన్ ల మద్దతు లభించడం సంతోషించ దగ్గ విషయం అని,అన్నారు. తాను నగరంలో 24/7 అందుబాటులో ఉంటానని, తమ వృత్తి పరమైన, సమస్యలు గానీ, వ్యక్తిగత సమస్యలు గానీ, తన దృష్టికి తీసుకు వస్తే ఖచ్చితంగా పరిష్క రిస్తానని హామీ నిచ్చారు. తమ గెలుపుకు కృషి చేయాలనీ, వైస్సార్సీపీ పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో, ల్యాబ్ టెక్నిషియన్ ల సంఘం జిల్లా నాయకులు,200 మంది లేబటెక్నిషియన్లు, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.

About Author