PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులకు నిధులు విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు :  చెన్నూరు మండలంలోని 55 అంగన్వాడీ కేంద్రాలకు గాను 34 అంగన్వాడీ కేంద్రాలకు “నాడు నేడు” ఫేజ్-2 కార్యక్రమంలో కింద మరమ్మత్తులకు రూ.23,31,000/- లు నిధులు మంజూరయ్యాయని చెన్నూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు, గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ యం.పి.టి.సి. పి.రఘురామి రెడ్డి లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి “నాడు నేడు” ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, ఆ క్రమంలోనే ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేశారని వారు తెలియజేశారు, గర్భవతులు శిశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మంచి పౌష్టికాహారాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు, అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుల లో భాగంగా పనులు చేపట్టేందుకు వెంటనే బ్యాంకు ఖాతాలు ప్రారంభించి పనులు ప్రారంభించాలని ఐసిడిఎస్ అధికారులకు వారు సూచించారు, ప్రతి గ్రామంలో మదర్స్ కమిటీలు వేయాలని, గ్రామ మదర్స్ కమిటీకి అంగన్వాడీ వర్కర్ చైర్మన్ గా ఉంటారని, కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతాయని వారు తెలిపారు,అవినీతికి తావు లేకుండా అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులు జరగాలని తెలియజేయడంజరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లు నాగరత్నమ్మ, గుర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author