PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి వస్తేనే భవన నిర్మాణ కార్మికులకు భవిష్యత్తు…

1 min read

కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్

టిడిపిలో చేరిన మహిళలు, యువకులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భవన నిర్మాణ రంగం పుంజుకుంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. సోమవారం నగరంలోని మౌర్య ఇన్ లో 6 వ వార్డుకు చెందిన ఇబ్రహీం ఆధ్వర్యంలో ఫైరోజ్ బ్రుందం తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ టిడిపి హయాంలో భవన నిర్మాణ కార్మికులకు మంచి పనులు ఉండేవన్నారు. మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే కార్మికుల జీవితాలు మారుతాయన్నారు. పెరిగిన ధరలతో భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. ఈ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న ప్రతి కార్మికుడు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. కర్నూల్లో తాను ఎమ్మెల్యే అవ్వగానే అన్ని రంగాల ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. పరిశ్రమలు తీసుకువచ్చి అందరికీ ఉపాధి ఉండేలా చేస్తానని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో  షాషా, షబ్బీర్, లతీఫ్, జహంగీర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మెహబూబ్, ఫయాజ్, అబ్దుల్ రజాక్, తదితరులు ఉన్నారు. అనంతరం నగరంలోని 5 వ వార్డుకు చెందిన మహిళలు కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ మహిళా కమిటీ నాయకురాలు సుశీలమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సులోచనమ్మ, వసుంధర, విశాలమ్మ, భార్గవి, తాజున్నీసా, శ్యామలమ్మ, తదితరులకు టి.జి భరత్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకోసం కష్టపడి పనిచేయాలని టి.జి భరత్ వీరికి సూచించారు. టిడిపి వస్తే మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో బాలు, శారద, తదితరులు పాల్గొన్నారు.

About Author