PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ గెలిస్తేనే యువ‌త‌కు భ‌విష్య‌త్తు…

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే యువ‌త‌కు భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మౌర్య ఇన్‌లో విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం, జ‌న‌సేన ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేప‌ట్టిన రా క‌ద‌లిరా కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వస్తోందన్నారు. పెరిగిపోయిన నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు, క‌రెంటు చార్జీలు, పన్నుల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితులు చూస్తున్నామ‌న్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం వ‌స్తే ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌న్న భ‌రోసా ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నామ‌ని తెలిపారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రంలో యువ‌త‌కు భారీగా ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేయ‌కుండా సొంత రాష్ట్రంలోనే ప‌ని చేసుకునే ప‌రిస్థితులు ఉంటాయ‌న్నారు. యువ‌త భ‌విష్య‌త్తుకు తెలుగుదేశం పార్టీ గ్యారెంటీ ఇస్తుంద‌న్నారు. ఇక క‌ర్నూల్లో ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు తీరాలంటే వచ్చే ఎన్నికల్లో త‌న‌ను గెలిపించాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని టి.జి భ‌ర‌త్ తెలిపారు.

About Author