PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపితో భవిష్యత్తుకు గ్యారెంటీ.. : టీజీ భరత్

1 min read

పల్లెవెలుగు, కర్నూలు:తెలుగుదేశం పార్టీతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 3వ వార్డులో ఆయన పర్యటించి ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి విడత మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అర్హులైనప్పటికీ పించన్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒంటరి మహిళగా ఉన్నప్పటికీ పెన్షన్ లేకపోవడం దారుణమన్నారు. ఇంటింటికి వెళ్లినప్పుడు టీజీ భరత్ తో ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. పింఛన్లు లేవని, పన్నులు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, స్థానికంగా పరిశ్రమలు తీసుకురావాలని భరత్ ను కోరారు. తాను గెలిచిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా టీజీ భరత్ అన్నారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. టిడిపితోనే ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి నాగ వీరాంజనేయులు, నేతలు రమేష్, గోపి, అచ్చి, నాగరాజు, చంద్రకాంత్, అక్బర్, శేషగిరి శెట్టి, శ్రీధర్, రవి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

About Author