NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పందులకు చెత్తకు నిలయంగా గడివేముల..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పారిశుద్ధ్యలేమితో గడివేముల గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది దీనికి తోడు పందులు తిరగడంతో గ్రామంలో దుర్వాసనకు ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు నరకం చూపిస్తుంది వైరల్ ఫీవర్లతో దగ్గు జలుబు గ్రామస్తులకు అనారోగ్యం పాలు చేస్తుంది  అధికారులు స్వచ్ఛభారత్ అంటూ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు కానీ అధికారుల నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు  ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యం క్రమం తప్పకుండా చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.. మరి అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి మరి.

About Author