PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూదరులు అరెస్ట్- నగదు సెల్ ఫోన్లు స్వాధీనం

1 min read

పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మండలంలోని రామనపల్లి గ్రామ వెలుపల గల డంపింగ్ యార్డ్ సమీపంలో ఆదివారం పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 9 వేల, 5 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, మండలంలోని రామన పల్లె గ్రామ వెలుపల గల డంపింగ్ యార్డ్ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు పక్క సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్మించడం జరిగిందని ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి పేక ముక్కలు, అలాగే 9 వేల 5 వందల రూపాయలు నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author