NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గణపయ్య.. విఘ్నాలు తొలగించవయ్య…​:టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూల్ నగర ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలి అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఓల్డ్ సిటీ నందు ఉన్న రాంబోట్ల స్వామి గుడి వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటుచేసిన లక్ష్మీ గణపతి విగ్రహానికి టీజీ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తలపెట్టే మంచి పనులన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరిగి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని అన్నారు. ఏ పని తలపెట్టిన మొదట వినాయకుడిని పూజించి ముందుకు సాగుతామని, దీనితో ఆ పని సజావుగా సాగుతుందని నమ్మకం, భరోసా కలుగుతుందని టీజీ అన్నారు. కర్నూలు నగర ప్రజలు ఎంతో మంచివారిని, మత సమరస్యానికి ప్రతికగా నిలిచేవారని, ఈసారి కూడా వినాయకుని ఉత్సవాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఒకరినొకరిని సహకరించుకుంటూ జరుపుకోవాలని టీజీ కోరారు. ఈ కార్యక్రమంలో జయంతి వెంకటేశ్వర్లు, విటల్ శెట్టి, రమేష్ బాబు, చెన్న తదితరులు పాల్గొన్నారు.

About Author