PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాంధీ విగ్రహం ధ్వంసం

1 min read

పల్లెవెలుగువెబ్ : అమెరికాలో గాంధీ కంచు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం ధ్వంసం చేశారు. న్యూయార్క్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనను అమెరికాలో నివసిస్తున్న భారతీయులతోపాటు భారత కాన్సులేజ్‌ జనరల్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాపూజీ 117వ జయంతిని పురస్కరించుకుని గాంధీ స్మారక అంతర్జాతీయ ఫౌండేషన్‌ దీనిని బహూకరించగా.. 8 అడుగుల ఈ విగ్రహాన్ని న్యూయార్క్‌ యూనియన్‌ స్క్వేర్‌లో అక్టోబరు2, 1986లో ఏర్పాటుచేశారు.

         

About Author