PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాంధీ ఆశయ సాధనే లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: జాతిపిత మహాత్మగాంధీ ఆశయ సాధనే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డి.  ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మహత్మగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం అహింసా మార్గాన్ని ఎంచుకుని స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ  ఆశయ సాధనలో యువతరం నడవాలన్నారు.   జాతికి అంకితమైన మహత్తరమైన వ్యక్తులను  స్మరించుకుని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  కార్యక్రమంలో   వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.దేవ,  నాయకులు చంద్రకాంత్​ రెడ్డి, కౌన్సిలర్ చిన్న, ఎస్సీ సెల్ గౌరవాధ్యక్షుడు గోవిందరాజులు, ఆర్టీసీ రహీం, వీరన్న, బసరకోడు బూసి రెడ్డి , వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author