PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంగ ప్ర‌క్షాళ‌న చేస్తామ‌న్నారు.. శవాలు తేల్చారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో బీజేపీ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. “ కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే దేశంలో ప్రజల కష్టాలు డబుల్‌. గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు. కరోనా సమయంలో శవాలు తేల్చారు. మత పిచ్చి లేపి రాజకీయాలు చేస్తున్నారు. గాడ్సేని ఆరాధిస్తున్నవారికి పెద్దపీట వేస్తున్నారు. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం కావాలని యువత కోరుతుంది. బుల్డోజర్‌ మోడల్‌ కాదు, గోల్డెన్‌ తెలంగాణ మోడల్‌ కావాలని ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్‌ లాంటిటార్చ్‌ బేరర్‌ దేశానికి కావాలి’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

                                                    

About Author