PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంగానమ్మ తల్లి ఆశీస్సులు.. అందరిపై ఉండాలి: నగర మేయర్

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: గంగానమ్మ ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ప్రార్థించారు పశ్చిమ గోదవరిలోని ఏలూరు మేయర్​ షేక్​ నూర్జహాన్​ పెదబాబు. ఏలూరు నగరంలోని 50వ డివిజన్​ మార్కెట్​ యార్డు సమీపంలోని వీవీ నగర్​లో శ్రీ గంగానమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు పాల్గొని అమ్మవారికి పసుపు నీళ్లతో స్నానాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పసుపు, కుంకుమ,చీరలు సమర్పించి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఏడాది దసరాకి ముందు ఆలయ నిర్వాహకులు అమ్మవారికి సంబరాలు చేపట్టడం జరుగుతుందని, గంగానమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల రాములు,యార్లగడ్డ సత్తిబాబు, ఆబూతుల గణపతి,చంద్ర రావు,అమరావతి అశోక్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author