NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గంగూలీని అణచివేస్తున్నారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : సౌరవ్ గంగూలీ అణచివేతకు గురవుతున్నాడని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ గా పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. “ఏం తప్పు చేశాడని గంగూలీని తొక్కేస్తున్నారు? ఈ పరిణామాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గంగూలీ పరిస్థితి పట్ల దిగ్భ్రాంతికి కూడా గురయ్యాను. సౌరవ్ ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి. భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించినవాడు. భారత క్రికెట్ కు ఎంతగానో సేవలందించాడు. అతడు బెంగాల్ కు మాత్రమే కాదు, భారతదేశానికే గర్వకారణం. ఎందుకు అతడిని ఇంత అమర్యాదకర రీతిలో సాగనంపుతున్నారు?” అంటూ మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.

             

About Author