PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంట్లో గ్యాస్​ లీక్​.. ముగ్గురికి తీవ్రగాయాలు

1 min read

పల్లెవెలుగు గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలోని ఓ ఇంట్లో గ్యాస్​ లీక్​ అయి ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోనెగండ్లలోని సంజీవ రాయుడు కొండ దగ్గర నివాసముంటున్న మౌలాలి, శోభ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు అరవింద్​. రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి కూలీకి వెళ్లారు.

సాయంత్రం ఇంటికి వచ్చి తాళం తీశారు. అప్పటికే గ్యాస్​ పైపులీకై .. ఇంటి నిండా గ్యాస్​ నిండుకుని ఉంది. ఇది గమనించని మౌలాలి బీడిని వెలిగించగా హఠాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న అరవింద్, మౌలాలి, శోభకు తీవ్ర గాయాలయ్యాయి. గోనెగండ్ల ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీ పనులు చేసుకుని పొట్టపోసుకునే మౌలాలి కుటుంబం తీవ్ర గాయాలు కావడం, ఇంట్లో బట్టలు కాలిపోవడంతో.. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు.

About Author