PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గౌరు’ కృషి.. భేష్​..: నారా చంద్రబాబు నాయుడు

1 min read

పల్లెవెలుగు వెబ్​: స్థానిక నగర పంచాయతీ ఎన్నికల్లో  టీడీపీ నంద్యాల పార్లమెంట్​  అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి , డోన్​ ఇన్​చార్జ్​ మన్నే సుబ్బారెడ్డి సమిష్టిగా పోరాడి విజయం సాధించారన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.  కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ… ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారని అభినందించారు. డోన్ మున్సిపాలిటీలో 6 వార్డులు, బేతంచర్ల నగర పంచాయతీలో టీడీపీ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్​, నగర పంచాయతీ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులతో  కర్నూల్ జిల్లా పార్టీ స్థితిగతుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల పార్లమెంట్​ పరిధిలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పోరాడి… గట్టిపోటీ ఇచ్చారని, ఇందుకు నంద్యాల పార్లమెంట్​ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి కృషి అభినందనీయమన్నారు.  

పార్లమెంట్​ పరిధిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజలు, కార్యకర్తలు గౌరు వెంకట రెడ్డిని సంప్రదించి… పరిష్కరించుకోవాలని సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు.  వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా , కార్మిక, ఉద్యోగ, రైతుల వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి… పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశం అనంతరం జిల్లా నుండి యువత టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో డోన్ టిడిపి ఇన్ఛార్జి మన్నే సుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.

About Author