PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాయ‌త్రీ గోశాల‌కు రూ. 1,00,116 విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: న‌గ‌ర శివారులోని గాయ‌త్రీ సేవ స‌మితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాయత్రీ గోశాల‌కు క‌ర్నూలుకు చెందిన శ‌ర‌ణం లక్ష్మీకాంత్ అనే వ్యక్తి విరాళం ఇచ్చారు. త‌న తండ్రి శ‌ర‌ణం న‌ర‌సింహారావు జ్ఞాప‌కార్థం గోశాల నిర్వహ‌ణ కోసం రూ. 1,00,116 అంద‌జేస్తున్నట్లు తెలిపారు. ఈ మేర‌కు చెక్కును మౌర్య ఇన్‌లో టి.జి.వి సంస్థల చైర్మన్ టి.జి భ‌ర‌త్ చేతుల మీదుగా గోశాల అధ్యక్షుడు జ‌గ‌దీష్ గుప్తకు అంద‌జేశారు. గాయ‌త్రీ గోశాల‌లో గోవుల నిర్వహ‌ణ చాలా బాగుంద‌న్నారు. గోశాల నిర్వహ‌ణ కోసం త‌మ వంతు బాధ్యత‌గా ఈ స‌హాయం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో లక్ష్మీకాంత్ త‌ల్లి ధ‌న‌లక్ష్మి, గోశాల నిర్వాహ‌కులు పాల్గొన్నారు.

About Author