PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

1 min read

– కార్యాలయాల్లో అధికారులు మర్యాద ఇవ్వడం లేదంటూ నాయకులు ఆవేదన

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో గురువారం నాడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధిపై జరుగుతున్న పనుల పురోగతిని వివిధ శాఖల అధికారులు వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులను చేర్చుకోవాలని మెనూ ప్రకారం పోషకాహారం అందివ్వాలని వేరే మండలాల్లో అంగన్వాడి కేంద్రాలు కావాలని కోరుతున్నారని  గడివేముల మండలంలో వింత పరిస్థితి ఉన్నట్టు  తన దృష్టికి వచ్చిందని సంఖ్యాబలం లేకుండా అంగన్వాడి కేంద్రాలు నిర్వహించాలనుకుంటే కుదరదని అంగన్వాడి సూపర్వైజర్ ను హెచ్చరించారు ఈ సందర్భంగా కొంతమంది నాయకులు మాట్లాడుతూ గృహనిర్మాణ శాఖ ఏ ఈ నిర్మాణాలు పూర్తి చేసుకున్న గృహాలకు బిల్లులు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని కార్యాలయంలో వెళ్తే కనీసం కుర్చీ కూడా అధికారులు వేయడం లేదని పేరుకే నాయకులుగా ఉన్న ఎటువంటి పనులు జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పాత సమస్యలు తీరేలా కనబడటం లేదని వాపోయారు ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలానికి వచ్చే నిధుల వివరాలు అధికారులు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రజలలో తీసుకువెళ్లడంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి వీడాలని నాయకులను సమన్వయం చేసుకొని పని చేయాలని ఈ సందర్భంగా హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీడీవో మల్లీశ్వరప్ప తాసిల్దార్ శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author