NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానుభావులను గుర్తించుకోవాలి: బుగ్గన

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి పట్టణంలో గతంలో రోడ్డు విస్తరణలో తొలగించిన మహనీయుల విగ్రహాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పున: ప్రతిష్ట చేశారు. ఈసందర్భంగా శుక్రవారం సంఘసంస్కర్తలైన బీఆర్ అంబేడ్కర్, బీపీ శేషారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాలను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. స్వార్థం కోసం కాకుండా ప్రజల మంచికోసం తపించిన మహనీయుల మార్గాల్లో నేటి తరం నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author