PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తల్లినే గెంటేశాడు.. సిద్దూ పై సంచలన వ్యాఖ్యలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తనను, తన తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారని ఆరోపించారు. తన తండ్రి మరణించాక ఆస్తి దక్కించుకునేందుకు తనను, తన తల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడని ఆరోపించింది. తమ పట్ల సిద్దూ క్రూరంగా వ్యవహరించాడని తెలిపింది. తన తల్లి నాలుగు నెలలు ఆస్పత్రికే పరిమితమై.. 1989లో ఢిల్లీ రైల్వే స్టేషన్లో మరణించిందని సుమన్ తూర్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుమన్ తూర్ వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో సంచలనం రేపాయి.

        

About Author