NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జియో సంచలనం.. రూపాయికే 100 ఎంబీ డేటా !

1 min read

        ప‌ల్లె వెలుగు వెబ్ :  టెలికాం కంపెనీ జియో సంచలనానికి తెరతీసింది. అత్యంత కారు చౌక ధరకు ఇంటర్నెట్ అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రీపెయిడ్‌ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్‌ డేటా అందిస్తోంది రిలయన్స్‌ జియో.  100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.  ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్‌ అందుతుంది.  వాటర్‌ ప్యాకెట్‌ ధర కంటే తక్కువకి.. కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్‌ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్‌కే దక్కింది.

About Author