NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటి పన్ను పై వడ్డీ రాయితీ పొందండి

1 min read

– మార్చి 31 వరకు రాయితీ వర్తింపు
– ఉత్తేజిత ప్రతినిధి..నందికొట్కూరు మార్చి 17
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 34 ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లింపు దారులు చెల్లించవలసిన పన్ను బకాయిలను ఏక మొత్తంగా 2022-2023 రెండవ ఆర్థిక సంవత్సరం వరకు పూర్తిగా చెల్లించాలన్నారు. ఆ విధంగా చెల్లించినచో వడ్డీ లేకుండా చెల్లించుటకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశం కేవలం ఈనెల 31 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు. కాబట్టి నందికొట్కూరు పట్టణ ప్రజలు ఈ అవకాశం ను సద్వినియోగం పరుచుకోవాలని ఆయన సూచించారు.

About Author