PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నాడు–నేడు’ పనులు త్వరగా పూర్తి చేయండి

1 min read

– సుగాలిమెట్ట కేజీబీవీ పనులను పరిశీలించిన జేసీ–3 శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మన బడి నాడు – నేడు పనుల్లో నాణ్యత లోపించకుండా ఇచ్చిన గడువులోగా సత్వరమే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జెసి (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం సుగాలి మెట్ట గ్రామం కెజిబివి స్కూల్ లో జరుగుతున్న మన బడి నాడు – నేడు పనులను జెసి (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జెసి (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు మనబడి నాడు – నేడు నిర్మాణ పనులు మరియు ఇతర పనులు ఎంత వరకు కంప్లీట్ చేశారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని త్వరితగతిన నిర్మాణపనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వారం రోజులు తానే ప్రతి స్కూల్ ను స్వయంగా సందర్శించి నిర్మాణ పనులు పరిశీలించడం జరుగుతుందిని, సకాలంలో పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తే సహించేది లేదని జెసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ఏఈ, స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author