PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీని వదిలించుకోవడమే స్వాతంత్ర్యం కంటే పెద్దది !

1 min read

పల్లె వెలుగువెబ్ : బీజేపీ పై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విరుచుకుపడ్డారు. వివిధ వర్గాల మధ్య బీజేపీ విద్వేష బీజాలు నాటుతోందని ఆరోపించారు. బ్రిటిష్​ పాలన నుంచి విముక్తి కంటే బీజేపీని వదిలించుకోవడమే పెద్దదని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో జమ్మూకశ్మీర్ అస్థిత్వం ప్రమాదంలో పడిందన్నారు. యువత బెదిరింపులకు వెనుకడుగు వేయకుండా.. అహింసాయుతంగా, ప్రేమ, స్నేహ సందేశాలు చాటుతూ సవాళ్లకు ధీటుగా నిలబడాలని పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్ మహాత్మా గాంధీ భారత్ లో చేరిందని, గాడ్సే దేశంగా మార్చేందుకు అనుమతించదని పేర్కొంది. పాలనలో విఫలమైనందునే గుళ్లు, మసీదుల పేర బీజేపీ ప్రచారం చేస్తోందని విమర్శించారు.

            

About Author