PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సావిత్రిబాయి పూలేకు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​: భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయ రాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఆస్పరిమండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ కొమ్మ రమేష్ ఆధ్వర్యంలో   ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా కొమ్మ రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే అలాంటి మహనీయురాలుని స్మరిస్తూ కులం మతం అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్న ఏకైక మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అలాంటి మహనీయుల జయంతి గ్రామగ్రామాన ప్రతి ఒక్క బహుజనులు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువ అయ్యావని అధికారులు చూసీచూడనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని డిమాండ్ చేశారు రాబోయే కాలంలో బహుజన రాజ్యం వస్తుందని ప్రతి ఒక్క బహుజనులు కోరుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు చిగిలీరంగన్న ,మధు ,రాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author