PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెంకట సుబ్బయ్యకు ఘననివాళి

1 min read

మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం,డిప్యూటీ సీఎం
పల్లెవెలుగు వెబ్​, కడప: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. సాయంత్రం 4.15 గంటలకు సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి వెంకట సుబ్బయ్య స్వగృహానికి వెళ్లి.. భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన వెంకట సుబ్బయ్య… గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కడపలోని నాగరాజుపేట అరుణాచలం హాస్పిటల్​లో చికిత్సపొందుతూ.. కోలుకోలేక మృతి చెందినట్లు బంధువులు సీఎంకు వివరించారు. ఆ తరువాత సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి…. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్​బాష, కడప మేయర్​ , వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు,వైఎస్సార్సీపీ నాయకులు భరత్ రెడ్డి , సబ్ కలెక్టర్ పృద్వితీజ్, ఎమ్ ఆర్ ఓ శివరామిరెడ్డి,సిఐ సత్యనారాయణ తదితరులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

About Author