NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాలివీటి రామలక్ష్మమ్మకు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: మాజీ ఎంఎల్ఏ కీశే గాలివీటి విశ్వనాథ రెడ్డి సతీమణి రామలక్ష్మమ్మ దశదిన ఖర్మఖాండ కార్యక్రమ ఆదివారం వీరబల్లె లో జరిగింది. కార్యక్రమంలో ఎంపి మిథున్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎం ఎల్ సి జకియా ఖానం, రాజంపేట, పీలేరు, తంబల్లపల్లె, చిత్తూరు ఎంఎల్ ఏ లు మేడా మల్లికార్జున రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాధ రెడ్డి,ఆరని శ్రీనివాసులు,మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి, మాజీ జెడ్ పి వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ డి సి ఎం ఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి,చిత్తూరు డి సి సి బి చైర్మన్ రెడ్డెమ్మ , కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామలక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.


About Author