PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆఫ్రికా దేశ‌మైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీల‌తో వెళ్తున్న లారీ, ప్రయాణీకుల‌తో వెళ్తున్న బ‌స్సు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 41 మంది చ‌నిపోగా.. 33 మంది గాయ‌ప‌డ్డారు. క్షత‌గాత్రుల‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. లారీ టైర్ పేల‌డంతో డ్రైవ‌ర్ వాహ‌నం పై నియంత్రణ కోల్పోయాడ‌ని, దీంతో బ‌స్సుకు ఎదురుగా వెళ్లడంతో ప్రమాదం జ‌రిగిందని అక్కడి మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో బ‌స్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత‌కు క్షత‌గాత్రులు రోడ్డు పై చెల్లాచెదురుగా ప‌డ్డారు. ఘ‌ట‌న‌కు సంబంధించి అక్కడి సోష‌ల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి. డ‌బ్ల్యూహెచ్ వో ప్రకారం ప్రపంచంలోనే ప్రమాద‌క‌ర‌మైన రోడ్లు ఆఫ్రికాలో క‌నిపిస్తాయి. ఏటా ల‌క్ష జ‌నాభాకు 26 మంది రోడ్డు ప్రమాదాల్లోనే చ‌నిపోతున్నట్టు ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి.

About Author