PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : శ్రీకాకుళం జిల్లాలో ఘోర‌రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప‌లాస మండ‌లం సుమ్మాదేవి జాతీయ ర‌హదారి పై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ దుర్ఘట‌న‌లో న‌లుగురు పోలీసులు అక్కడిక‌క్కడే మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. బైరిసారంగ‌పురంలో ఓ జ‌వాను మృత‌దేహం అప్పగించి ఏఆర్ కానిస్టేబుళ్లు బొలెరో వాహ‌నంలో వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండ‌గా.. వీరి వాహ‌నాన్ని లారీ ఢీకొంది. స‌మాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల పై ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబాలు క‌న్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ జ‌వాను మృత‌దేహాన్ని అప్పగించ‌డానికి వెళ్లి.. కాన‌రాని లోకాల‌కు వెళ్లడం పట్ల హృద‌య‌విదార‌కంగా రోదిస్తున్నారు.

About Author