PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తుల సౌకర్యార్థం విద్యుత్ వాహనం బహుకరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా దర్శనానికి వచ్చే వృద్దులు ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని. దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మార్కాపురం పట్టణ ప్రముఖ డాక్టర్ కనకదుర్గ 6 లక్షల విలువైన విద్యుత్ వాహనాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ ,స్థానిక శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి వాహనానికి పూజలు నిర్వహించి దేవస్థానం ఆలయ ఈవో లవన్నకి అందచేశారు. ఈ వాహనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.

About Author